కవిత పిటిషన్పై నేడు సుప్రీం విచారణ
byసూర్య |
Mon, Mar 27, 2023, 07:55 AM
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. ఈ కుంభకోణంలో ఈడీ తనకు నోటీసులు జారీ చేయడాన్ని కవిత పిటిషన్లో సవాలు చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం.త్రివేదిల ధర్మాసనం విచారణకు స్వీకరించింది. తొలుత 24 విచారణ జరుపుతామని చెప్పినా.. ఆ తర్వాత తదుపరి విచారణ తేదీని 27గా ప్రకటించింది.
Latest News