byసూర్య | Sun, Mar 26, 2023, 11:14 AM
వైరాలో ఆదివారం హాథ్సే హాథ్ జోడోయాత్రను నిర్వహించేందుకు కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి వర్గీయులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం సాయంత్రం నాలుగుగంటలకు జాతీయ ప్రధాన రహదారిలోని అయ్యప్పస్వామి ఆలయం నుంచి ప్రారంభమయ్యే జోడోయాత్ర తల్లాడ రోడ్డులోని వేబ్రిడ్జి వరకు కొనసాగనుంది. అక్కడ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి ఆధ్వర్యంలో జరిగే ఈ యాత్ర సభలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యరావు ఠాక్రే, ఇన్చార్జురోహిత్ చౌదరి, నదీమ్ ఆజాద్, రేణుకాచౌదరి పాల్గొంటారు. రేణుక వర్గీయులైన ధరావత్ రాంమ్మూర్తి నాయక్, కట్ల రంగారావు, మానుకొండ రాధాకిషోర్ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.