byసూర్య | Sat, Mar 25, 2023, 09:49 AM
జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ పరిధిలోని బచ్చన్నపేట మండలం ఎద్దుగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, సామాజిక సేవలో నిరంతరం ముందు ఉండే ముక్కెర తిరుపతి రెడ్డి విరాళం అందించారు. తిరుపతి రెడ్డి సోదరులు, బచ్చన్నపేట మండలం దబ్బగుంటపల్లి గ్రామ సర్పంచ్ ముక్కెర కరుణాకర్ రెడ్డి ద్వారా అందించిన 10 వేల 116 రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు శనివారం అందించారు. ఈ కార్యక్రమంలో కోడువటూర్ కు చెందిన నీల రమేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఉమ్మెంతల మల్లారెడ్డి,
ఉమ్మెంతల బాల్ రెడ్డి, టి. అంజయ్య, ఎద్దు ప్రభాకర్, ఎద్దు హరీష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.