byసూర్య | Sat, Mar 25, 2023, 09:48 AM
దక్షిణ మధ్య రైల్వే రికార్డు సృష్టిస్తోంది. ప్యాసింజర్ రైళ్లలో టికెట్లతో పాటు సరుకు రవాణా ద్వారా రికార్డు స్థాయి ఆదాయాన్ని సంపాదిస్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.4,119 కోట్లు ఆర్జించగా, ఈ ఆర్థిక సంవత్సరం మరో వారం ఉండగానే రూ.5,008 కోట్లు ఆర్జించింది. దేశంలోని 18 జోన్లలో ఆదాయంలో ఐదో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ జోన్ లోని ఎక్స్ప్రెస్ రైళ్లలో ఆక్యుపెన్సీ రేషియో 123 శాతంగా ఉంది.