byసూర్య | Thu, Mar 23, 2023, 08:40 PM
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాల్లో పెను దుమారాన్ని రేపుతోంది. మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వారిద్దరికీ కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతో తన పేరును లాగి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర పన్నారని వారిద్దరికీ లీగల్ నోటీసులు పంపుతున్నట్లు తెలిపారు.