భార్యను దారుణంగా హతమార్చిన భర్త

byసూర్య | Mon, Mar 20, 2023, 12:47 PM

మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నా ఓ భర్త భార్యను గొంతు పిసికి అతి దారుణంగా హతమార్చాడు. ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రకారం శంకర్ పల్లి మండలం కొజ్జగూడెం గ్రామానికి చెందిన సరిత(25)ను కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు శ్రీకాంత్‌తో సుమారు ఏడు సంవత్సరాల క్రితం పెద్దలు వివాహం చేయగా పెళ్లయిన ఆరు నెలల వరకు అంతా బాగానే ఉన్న శ్రీకాంత్ తదనంతరం నిత్యం భార్యను వేధించేవాడు. బూతులు తిడుతూ, శారీరకంగా వేధిస్తూ ఇబ్బందులకు గురి చేసేవాడు. గత 15 రోజుల క్రితం ఇబ్బందులకు గురి చేయడంతో సరిత తన తల్లి గారి ఇల్లు అయిన కొజ్జ గూడెం గ్రామానికి వచ్చింది. ఒగ్గు శ్రీకాంత్ అత్తారింటికి వచ్చి తన భార్యను తనతో పంపించాలని కోరగా అత్తమామలు పంపించలేదు. దింతో కొత్తపల్లి గ్రామానికి వెళ్లిన శ్రీకాంత్ ఇంట్లో ఉరేసుకునేందుకు ప్రయత్నించగా శ్రీకాంత్ తల్లి కోడలు సరితకు ఫోన్ చేసి నీవు రాకపోతే ఉరేసుకొని చనిపోతాడట, ఉరేసుకుంటుంటే మేము ఆపామని తెలిపింది. దాంతో ఒకటి, రెండు రోజుల తదనంతరం శ్రీకాంత్ తల్లి, పెదనాన్న, మేనమామలు కలిసి కొజ్జ గూడెం గ్రామానికి వెళ్లి సరిత‌తో పాటు పిల్లలను తీసుకెళ్లి దించారు. ఆదివారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో భార్య ను కాలితో తొక్కి, ఆమె మీద కూర్చుని రెండు చేతులతో గొంతు పిసికి అతి దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో శంకర్పల్లి పీఎస్‌కు వచ్చి తన భార్యను చంపానని చెప్పి పోలీసుల వద్ద లొంగిపోయాడు. తల్లి చనిపోవడం, తండ్రి జైలుకు వెళ్లడంతో ఐదు సంవత్సరాల వర్షిత్, మూడు సంవత్సరాల ప్రీతిక‌లు దిక్కు లేని వారయ్యారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM