మంత్రిపై ఆరోపణలు తగదు: బిఆర్ఎస్

byసూర్య | Mon, Mar 20, 2023, 11:48 AM

మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రాష్ట్ర యువ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి పై నిరాధార ఆరోపణలు చేయడం మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నేత కొత్త మనోహర్ రెడ్డికి తగదని, వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు బేర బాలకిషన్, మురుకుంట్ల అరవింద్ శర్మ, ఉపాధ్యక్షుడు నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విలేకరులతో వారు మాట్లాడుతూ. ఏమైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలే తప్ప పత్రికా ముఖంగా ఆరోపణలు చేయరాదని సూచించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కార్యదర్శి అంజయ్య ముదిరాజ్, షాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నెంటూరి రవీందర్ రెడ్డి, ఆర్కేపురం డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM