byసూర్య | Mon, Mar 20, 2023, 11:40 AM
బంధువుల పెళ్లికి వస్తుండగా బస్సు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడి మహిళ మృతి చెందిన ఘటన విషాదం నింపింది. ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రకారం ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన అయిలి పద్మ(43) శనివారం రామగిరి మండలం పన్నూరు సమీపంలోని కల్యాణ మండపంలో జరిగే బంధువుల పెళ్లి కోసం పెద్దపల్లి నుంచి మంథనికి ఆర్టీసీ బస్సులో బయలుదేరగా పన్నూరు క్రాస్రోడ్డు వద్ద బస్సు దిగుతుండగా కాలు జారి కింద పడటంతో తలకు గాయమైంది. గమనించిన స్థానికులు ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్లో నెంబరు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో పద్మను మొదట పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి బతకడం కష్టమని చెప్పడంతో శనివారం అర్ధరాత్రి పద్మను తీసుకొని ఇంటికి బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున మార్గమధ్యంలో ఆమె మృతి చెందింది. పద్మ భర్త రవీందర్ కూడా గతంలో మృతి చెందడంతో వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. మృతురాలి కూతురు సౌమ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు రామగిరి పోలీసు లు పేర్కొన్నారు.