byసూర్య | Mon, Mar 20, 2023, 11:38 AM
జగిత్యాల పట్టణంలోని 28 వార్డులో త్రాగు నీరు సక్రమంగా రాక ఇబ్బందులు పడుతున్నమని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరఫరా అయ్యే త్రాగు నీటికి చాలా మంది కరెంట్ మోటర్లు బిగించడంతో తమకు నీరు సరిగా రాక నానా తంటాలు పడుతున్నామని అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మిషన్ భగీరథ పైపులైన్ త్రవ్వి రెండేళ్లు అవుతున్న నీరు రావడం లేదంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు.