బీజేపి నేత, రైతు వేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి అరెస్ట్

byసూర్య | Mon, Mar 20, 2023, 11:36 AM

జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం రోజున తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాలు లీక్ వ్యవహారంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో బిజేపి నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డి జగిత్యాల టౌన్ పోలీసుల యొక్క విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదు పై ఆదివారం అరెస్టు చేశారు. విధులకు ఆటంక పరిచి, పోలీసులను చేతులతో నెట్టి వేసి, పోలీసు వాహనం పైకి ఎక్కి నానా హంగామా సృష్టించి, పోలీసులకు, అక్కడున్నా వారికి భయబ్రాంతులకు గురి చేస్తూ, పోలీసు వాహనం ను ధ్వంసం చేసి నష్ట పర్చిన పన్నాల తిరుపతి రెడ్డి పై అక్కడ విధులలో ఉన్న కానిస్టేబుల్ రాజి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రోజు పాన్నాల తిరుపతి రెడ్డి ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.


Latest News
 

వాళ్లిద్దరి బాగోతాలన్ని తెలుసు.. వారంలో బండారమంతా బయటపెడతా: ఎర్రబెల్లి దయాకర్ Sat, Apr 20, 2024, 07:46 PM
'ఇది గలీజ్ బుద్ధి కదా.. సిగ్గు తెచ్చుకోవాలి'.. బల్మూరి వెంకట్, క్రిశాంక్ మధ్య ట్వీట్ వార్ Sat, Apr 20, 2024, 07:34 PM
బట్టతలపై వెంట్రుకలు రప్పించేందుకు ట్రీట్మెంట్.. రిజల్ట్‌ చూసి పేషెంట్ల మైండ్ బ్లాక్ Sat, Apr 20, 2024, 07:30 PM
చిన్న క్యారీ బ్యాగ్ ఎంత పని చేసింది.. అంత పెద్ద 'ఐకియా'నే ఫైన్ కట్టించింది. Sat, Apr 20, 2024, 07:23 PM
తీన్మార్ మల్లన్న గిదేందన్నా.. గరీబోళ్లు కదన్న.. బక్కా జడ్సన్ రిక్వెస్ట్ Sat, Apr 20, 2024, 07:20 PM