byసూర్య | Mon, Mar 20, 2023, 11:36 AM
జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం రోజున తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాలు లీక్ వ్యవహారంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో బిజేపి నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డి జగిత్యాల టౌన్ పోలీసుల యొక్క విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదు పై ఆదివారం అరెస్టు చేశారు. విధులకు ఆటంక పరిచి, పోలీసులను చేతులతో నెట్టి వేసి, పోలీసు వాహనం పైకి ఎక్కి నానా హంగామా సృష్టించి, పోలీసులకు, అక్కడున్నా వారికి భయబ్రాంతులకు గురి చేస్తూ, పోలీసు వాహనం ను ధ్వంసం చేసి నష్ట పర్చిన పన్నాల తిరుపతి రెడ్డి పై అక్కడ విధులలో ఉన్న కానిస్టేబుల్ రాజి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రోజు పాన్నాల తిరుపతి రెడ్డి ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.