byసూర్య | Sun, Feb 05, 2023, 06:10 PM
బీజేపీ ఎన్ని ఆటలు ఆడినా అధికారంలోకి రావడం అసాధ్యమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. . అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై రాష్ట్ర బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నట్లున్నారన్నారు. తనకు కాంగ్రెస్ చరిత్ర కంటే.. బీజేపీ చరిత్ర ఎక్కువగా తెలుసంటూ కీలక వ్యాఖ్యు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బట్టి.. గవర్నర్గా తమిళిసై సౌందర్రాజన్ను మార్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ జోస్యం చెప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు బీఆర్ఎస్ సర్కార్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన గవర్నర్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారని.. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందన్నారు జగ్గారెడ్డి.