byసూర్య | Sun, Feb 05, 2023, 06:07 PM
తెలంగాణలో రాష్ట్రపతి పాలన రాబోతోంది అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇదిలావుంటే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయన్న వార్తలు పెద్దఎత్తున వస్తున్నాయి. ఇప్పటికే ఇది ఎన్నికల సంవత్సరం కాగా.. ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి అధికార బీఆర్ఎస్.. ఎన్నికలకు వెళ్లనుందని వివక్ష నేతలు జోస్యం చెప్తున్నారు. అయితే... అదే కోవలో చేరారు మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాగా.. కేవలం ముందస్తుకు వెళ్తారనటమమే కాకుండా.. ముహూర్తం కూడా చెప్తున్నారు ఉత్తమ్. "ఈ నెలాఖరున తెలంగాణ శాసన సభ రద్దు కాబోతోంది.. తెలంగాణలో రాష్ట్రపతి పాలన రాబోతోంది." అంటూ కరాఖండిగా చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతే కాకుండా.. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే స్థానంలో 50 వేలకు పైగా మెజార్టీ వస్తుందని బల్లగుద్ది చెప్తున్నారు. ఒకవేళ 50 వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ కూడా విసురుతున్నారు.