కేసీఆర్, గవర్నర్ మధ్య సయోధ్య కుదిరిందా,,,జగ్గారెడ్డి ప్రశ్న

byసూర్య | Sat, Feb 04, 2023, 12:26 AM

కేసీఆర్, గవర్నర్ మధ్య సయోధ్య కుదిరిందా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఇదిలావుంటే తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై రెండేళ్ల తర్వాత ప్రసంగించారు. అయితే.. ఈ ప్రసంగం మీద విపక్ష పార్టీల నేతలు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ శాసన సభ్యుడు జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై బయట చాలా నరికారన్నారు. బయటేమో పులిలా గాండ్రించారని.. తీరా అసెంబ్లీ లోపలికి వెళ్లాక పిల్లి తీరుగా ప్రసంగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌కు గత్యంతరం లేకే అలా మాట్లాడారని తెలిపారు. గవర్నర్‌కు కేసీఆర్‌కు మధ్య రాజీ కుదిరిందని జగ్గారెడ్డి ఆరోపించారు. గవర్నర్ పెద్ద పెద్ద మాటలు చెప్పి.. ప్రసంగంలో తుస్సుమనిపించారంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌, బీజేపీకి గవర్నర్ బీటీంగా మారిపోయారంటూ ఆక్షేపించారు. సీఎం కేసీఆర్‌ డైరెక్షన్‌లోనే గవర్నర్‌ నడిచారని జగ్గారెడ్డి విమర్శించారు. ఒకవేళ అలా మాట్లాడకపోతే గవర్నర్ మైక్ కూడా కట్ అవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో కనబడాలనుకున్నారు.. కనిపించారు.. అంతే.. అంతకుమించి ఏమీ లేదంటూ జగ్గారెడ్డి కీలక కామెంట్లు చేశారు.


అంతకుముందు.. అసెంబ్లీలో ప్రసంగించిన గవర్నర్ తమిళిసై.. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందంటూ కొనియాడారు. దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారనుందని తమిళిసై అన్నారు. ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నామని, గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని అన్నారు. ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించిందన్నారు. "రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం. రైతు బీమా అందిస్తున్నాం. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్దరించాం. రైతు పండించే ప్రతీ బియ్యం గింజను కొనుగోలు చేస్తాం. ఎన్నో సవాళ్లను ప్రభుత్వం అధిగమించింది. రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశాం. తెలంగాణ ప్రజల తలసారి ఆదాయం మూడింతలు అయ్యింది. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు తీసుకొచ్చాం. రైతుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంది. హైదరాబాద్‌లో 41 బీసీ కులాల కోసం ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపట్టాం. తెలంగాణలో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను 310కి పెంచాం." అంటూ తమిళిసై పేర్కొన్నారు.



Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM