ఫిబ్రవరి 4, 5 తేదీల్లో సిటీలో నీళ్లు బంద్

byసూర్య | Thu, Feb 02, 2023, 03:18 PM

హైదరాబాద్ లో రెండ్రోజుల పాటు నీటి సరఫరా బంద్ కానుంది. మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ మరమత్తు పనుల కారణంగా నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడనుంది. ఫలితంగా హైదరాబాద్ లోని పలు కాలనీలకు దాదాపు 30 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-2కి సంబంధించి 1600 ఎంఎం డయా పైప్‌లైన్ కు ఫిబ్రవరి 4, 5 తేదీల్లో మరమ్మతు చేయనున్నారు.  దీంతో ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు బాలాపూర్‌, మేకల మండి, మారేడ్‌పల్లి, తార్నాక, లాలాపేట్‌, బుద్ధనగర్‌, హస్మత్‌పేట, ఫిరోజ్‌గూడ, భోలక్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM