ఫిబ్రవరి 4, 5 తేదీల్లో సిటీలో నీళ్లు బంద్

byసూర్య | Thu, Feb 02, 2023, 03:18 PM

హైదరాబాద్ లో రెండ్రోజుల పాటు నీటి సరఫరా బంద్ కానుంది. మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ మరమత్తు పనుల కారణంగా నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడనుంది. ఫలితంగా హైదరాబాద్ లోని పలు కాలనీలకు దాదాపు 30 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-2కి సంబంధించి 1600 ఎంఎం డయా పైప్‌లైన్ కు ఫిబ్రవరి 4, 5 తేదీల్లో మరమ్మతు చేయనున్నారు.  దీంతో ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు బాలాపూర్‌, మేకల మండి, మారేడ్‌పల్లి, తార్నాక, లాలాపేట్‌, బుద్ధనగర్‌, హస్మత్‌పేట, ఫిరోజ్‌గూడ, భోలక్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

Latest News
 

హైదరాబాద్ నగరంలో బ్యూరో డి ఫ్రాన్స్,,,త్వరలోనే ప్రారంభం Fri, Jun 02, 2023, 07:18 PM
ఎల్బీనగర్‌లో ఘోర ప్రమాదం,,,కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా చిన్నారి మృతి Fri, Jun 02, 2023, 07:18 PM
హార్ట్ ఎటాక్‌తో షటిల్ ఆడుతూ కుప్పకూలిపోయిన వ్యక్తి Fri, Jun 02, 2023, 07:17 PM
తనకు ఎన్ని మార్కులు వేస్తావంటూ,,,సామాన్యుడితో మంత్రి హరీశ్ సరదా ముచ్చట Fri, Jun 02, 2023, 07:16 PM
తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారింది,,,బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది Fri, Jun 02, 2023, 07:16 PM