byసూర్య | Thu, Feb 02, 2023, 10:57 AM
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాసాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిఘా ఏర్పాటు చేసేందుకు సీసీ కెమెరాలు బిగించారు. మాసాయిపేటకు చెందిన వంటేరు శ్రీనివాస్ రెడ్డి సీసీ కెమెరాలు బహూకరించారు. సీసీ కెమెరా ఏర్పాటుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు