బిజేపి కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో చేరికలు

byసూర్య | Mon, Jan 30, 2023, 05:05 PM

జగిత్యాల రూరల్ మండలo సోమన్ పల్లి గ్రామంలో అర్ఎంపి రవి వారి అనుచరులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 30మంది బిఅర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ సమక్షంలో సోమవారం జగిత్యాలలో పార్టీ లో చేరారు. ఎమ్మెల్యే వారికి జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంతతో కలిసి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, పాక్స్ చైర్మన్ సందీప్ రావు, సర్పంచ్ సింగం అరుణ అంజన్న, ఉప సర్పంచ్ గంగాధర్, మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, మండల రైతు బందు సమితి కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, యూత్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, ఎంపిడిఓ రాజేశ్వరి, ఎంఈవో గాయత్రి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM