byసూర్య | Mon, Jan 30, 2023, 04:59 PM
ప్రతి ఒక్క ఉపాధి హామీ కూలీలది ఆధార్ సీడింగ్ చేయాలని సోమవారం మాచారెడ్డి మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన ఎంపీడీవో ప్రమోద్ కుమార్, మండల పంచాయతీ అధికారి నాగరాజు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో 23,176 మంది ఉపాధి కూలీలు ఉండగా 16, 805 మంది కూలీలది ఆధార్ సీడింగ్ చేయడం జరిగిందన్నారు. మిగతా కూలీలది త్వరగా ఆధార్ సీడింగ్ చేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలో 100% ఇంటి పన్ను వసూలు చేయాలని అన్నారు. గ్రామాల్లో పెండింగ్లో ఉన్న నర్సరీ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో సాయిబాబా, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.