ప్రతి ఉపాధి కూలీది ఆధార్ సీడింగ్ చేయాలి..

byసూర్య | Mon, Jan 30, 2023, 04:59 PM

ప్రతి ఒక్క ఉపాధి హామీ కూలీలది ఆధార్ సీడింగ్ చేయాలని సోమవారం మాచారెడ్డి మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన ఎంపీడీవో ప్రమోద్ కుమార్, మండల పంచాయతీ అధికారి నాగరాజు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో 23,176 మంది ఉపాధి కూలీలు ఉండగా 16, 805 మంది కూలీలది ఆధార్ సీడింగ్ చేయడం జరిగిందన్నారు. మిగతా కూలీలది త్వరగా ఆధార్ సీడింగ్ చేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలో 100% ఇంటి పన్ను వసూలు చేయాలని అన్నారు. గ్రామాల్లో పెండింగ్లో ఉన్న నర్సరీ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో సాయిబాబా, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


Latest News
 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు Thu, Mar 28, 2024, 02:40 PM
బండి సంజయ్‌ పై కేసు నమోదు Thu, Mar 28, 2024, 02:34 PM
సమ్మర్ క్యాంప్ ద్వారా సరైన గైడెన్స్ అందించాలి: కలెక్టర్ Thu, Mar 28, 2024, 01:46 PM
మాతృ మరణాల నివారణకు పటిష్ట చర్యలు Thu, Mar 28, 2024, 01:43 PM
జైరాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి పర్యటన Thu, Mar 28, 2024, 01:41 PM