byసూర్య | Mon, Jan 30, 2023, 04:57 PM
బాన్సువాడ పట్టణ కేంద్రంలోనీ అంబేడ్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకుడు మాల్యాద్రి రెడ్డి కి వ్యతిరేకంగా దళిత ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో మహా ధర్నా, దళితుల పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భారత్ గార్డెన్ నుండి సోమవారం ర్యాలీ నిర్వహించి మాల్యాద్రి రెడ్డి దిష్టి బొమ్మ ను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. బాన్సువాడ నియోజక వర్గం దళిత ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. దళితుల జోలికి వస్తె వదిలే ప్రసక్తే లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాన్సువాడ నియోజక వర్గం అన్నీ మండలలలా దళిత సంఘం నాయకులు, దళిత సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.