byసూర్య | Sat, Jan 28, 2023, 12:39 PM
అశ్వరావుపేటలో ఉరివేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు. మండలానికి చెందిన ముళ్ల సత్యవేణి (34) తనకు గల బంగారు ఆభరణాలను గుర్రాలచెరువు గ్రామానికి చెందిన తోట శ్రీనుకు ఇచ్చింది. వీటిని తిరిగి ఇవ్వాలని కొంతకాలంగా అడుగుతున్న శ్రీను ఇవ్వడం లేదు. ఈ క్రమంలో సత్యవేణి గొడవపడి ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.