byసూర్య | Sat, Jan 28, 2023, 12:29 PM
ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ లో నెలకొనే వరద ముంపు సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. శనివారం శివసాయినగర్ కాలనీలో వరద ముంపు ప్రాంతాలలో నిర్మిస్తున్న బాక్స్ టైప్ డ్రైన్ పనులను స్థానిక కార్పొరేటర్ సుజాతనాయక్ తో కలిసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లెలగూడ నుంచి వచ్చే వరద నీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యను యుద్ధప్రా తిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ వరదనీటి పనులు సత్వరమే పూర్తిచేస్తేకాలనీవాసులకు వరద ముంపు నుంచి పూర్తి స్థాయిలో విముక్తి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.