మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
byసూర్య |
Sat, Jan 28, 2023, 11:15 AM
ప్రార్థనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ ఈవీవీ కాలనీలో నూతనంగా నిర్మించిన కట్ట మైసమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన పూజలకు ఆయన శనివారం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కె. రా మకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ తలారి మల్లేశ్, పార్టీ అధ్యక్షుడు బి. శ్రీరాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ కె. ధ న్రాజ్, మహిళా అధ్యక్షురాలు రూపారెడ్డి, కౌన్సిలర్లు నవీన్ కుమార్, వసంతరావు, నాయకులుజయరాజ్, శ్రావణ్ కుమార్, దిలీప్కుమార్, లక్ష్మీ శ్రీలతగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Latest News