తెలంగాణ విద్యార్థిని ప్రశ్నకు...ఆసక్తికర కథ చెప్పిన ప్రధాని

byసూర్య | Fri, Jan 27, 2023, 09:17 PM

వివిధ పేర్లతో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ తాజాగా ఓ కార్యక్రమంతో తెలంగాణ విద్యార్థినీతో ముచ్చటించారు. ఇదిలావుంటే దేశంలో తర్వలోనే పరీక్షల సీజన్ మొదలు కానుంది. ఈ క్రమంలోనే విద్యార్థులు తెగ టెన్షన్ పడుతుంటారు. కాగా.. ఈ సమయంలోనే.. విద్యార్థుల్లో ఒత్తిడిని తొలగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ.. శుక్రవారం రోజున విద్యార్థులతో "పరీక్షా పే చర్చ" పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ముచ్చటించారు. విద్యార్థుల్లో ఉన్న ఒత్తిడిని తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే.. చిన్నారులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలోనే మోదీని తెలంగాణకు చెందిన ఓ విద్యార్థిని ప్రశ్న అడగ్గా.. అందుకు ప్రధాని ఓ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా జవహర్‌ నవోదయ విద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థిని అక్షర.. తనకున్న సందేహాన్ని మోదీని అడిగింది. బహు భాషలపై పట్టు సాధించేందుకు ఎలాంటి కృషి చేయాలంటూ తన మనసులోని సందేశాన్ని ప్రధానిని అడిగేసింది. కాగా.. ఆ చిన్నారి సందేహాన్ని నివృత్తి చేసేందుకు ప్రధాని మోదీ.. ఓ ఎనిమిదేళ్ల చిన్నారి కథను ఉదాహరణగా చెప్పారు.


దేశంలోని ఓ ప్రాంతంలో కార్మికులు నివసించే బస్తీలో ఒక ఎనిమిదేళ్ల చిన్నారి ఉంది. ఆ చిన్నారి.. మలయాళం, మరాఠీ, హిందీ, బెంగాలీ, తమిళం బాషలను అలవోకగా మాట్లాడుతుంది. అంత చిన్న అమ్మాయి ఇన్ని బాషలు మాట్లాడటం నన్ను ఆశ్చర్యపర్చింది. అసలు ఆ బాలికకు అన్ని భాషలు ఎలా మాట్లాడగలుగుతోందని ఆరా తీశాను. అయితే.. ఆ చిన్నారి ఉంటున్న ప్రాంతంలో తన ఇంటి పక్కన వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు నివాసముంటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి బతికేందుకు వచ్చిన వాళ్లంతా ఒకే దగ్గర నివసించడం వల్ల.. ఆ చిన్నారి వాళ్లందరితో రోజూ మాట్లాడుతుండేది. అలా అలా ఆ అమ్మాయికి వాళ్లు మాట్లాడే బాషలు వచ్చాయి. అంటూ మోదీ ఎనిమిదేళ్ల చిన్నారి కథను వివరించారు. ఆ చిన్నారి చూపిన చొరవ మెచ్చుకోదగినదన్న ప్రధాని మోదీ.. ఇతర భాషలు నేర్చుకోవడానికి ప్రత్యేక అర్హతలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు అని అక్షరకు సూచించారు.


మరోపైవు.. ఈ సంవత్సరం పరీక్షా పే చర్చ కార్యక్రమం కోసం 38 లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు అడిగిన సందేహాలను ప్రధాని మోదీ ఓపిగ్గా వింటూ అన్నింటినీ నివృత్తి చేశారు. చదువు విషయంలో పిల్లలపై ఒత్తిడి పెట్టొద్దని తల్లిడండ్రులు, ఉపాధ్యాయులకు మోదీ సూచించారు. వారికి నచ్చిన రంగంలో పిల్లలను ప్రోత్సహించాలన్నారు. మానసిక ఉల్లాసం ఉంటేనే పిల్లలు బాగా చదువుతారని చెప్పారు. ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాస్తేనే సత్ఫలితాలు వస్తాయని తెలిపారు. రోజూ ఇంట్లో అమ్మను చూస్తే.. సమయపాలన ఎలా పాటించాలో తెలుస్తుందని విద్యార్థులకు మోదీ సూచించారు.



Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM