బీజేపీ సీనియర్ నేత డి.సత్యనారాయణ గుండెపోటుతో అకస్మిక మృతి

byసూర్య | Thu, Jan 26, 2023, 05:37 PM

పాతబస్తీకి చెందిన బీజేపీ సీనియర్ నేత, భాగ్యనగర్ జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు డి.సత్యనారాయణ గుండెపోటుతో అకస్మికంగా మరణించారు. ఆయన మరణంతో పాతబస్తీలో విషాదం ఛాయలు నెలకొన్నాయి. బీజేపీలో సుధీర్ఘకాంల నుంచి పనిచేస్తూ వచ్చిన డి.సత్యనారాయణ పార్టీ పరంగా పలు సేవాలు అందించారు.  జన్ సంఘ్ పార్టీగా బీజేపీ కొనసాగిన నాటి నుంచి డి. సత్యనారాయణ రాజకీయరంగ ప్రవేశం చేశారు. డి. సత్యనారాయణకు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. డి.సత్యనారాయణ మరణ వార్త తెలియగానే పలువురు నేతలు ఆయన పార్థికదేహాన్ని పరామర్శించి నివాళ్లులర్పించారు. బీజేపీ భాగ్యనరగ్ జిల్లా నాయకులు ఎస్.సురేందర్ రెడ్డి, గోల్కోండ జిల్లా బీజేపీ కార్యదర్శి ఉమా మహేందర్, బీజేపీ రాష్ట్ర నాయకులు దోరెటి ఆనంద్ గుప్తా, చార్మినార్, బహదూర్ పురా అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్లు సురేంద్, ప్రశాంత్, బీజేపీ నాయకులు వెంకటాచలం ముదిరాజ్, శ్రీనివాసచారి, టీఆర్ఎస్ నాయకులు సుంకరి రవీందర్, టీడీపీ నాయకులు శ్యాంసుందర్, నా‍‍యీ బ్రహ్మణ సంఘం హైదరాబాద్ పార్లమెంటు అధ్యక్షులు  శ్రీనివాస్ నాయీ, కార్యదర్శి  సంతోష్ తదితరులు డి. సత్యనారాయణకు నివాళ్లులర్పించారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా నేతలంతా డి.సత్యనారా‍యణ పాతబస్తీకి అందించిన సేవలను కొనియాడారు. 


Latest News
 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM