మేడ్చల్ జిల్లాలో విషాదకర ఘటన,,,వాహన తనిఖీలు జరుపుతుండగా దూసుకొచ్చిన లారీ

byసూర్య | Wed, Jan 25, 2023, 09:22 PM

విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీస్.. మృత్యువాత పడ్డాడు. ఈ ధారుణ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు  చేసుకొంది. వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ ట్రాఫిక్ పోలీస్‌పై కంటైనర్ లారీ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ట్రాఫిక్ పోలీస్.. అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ హోంగార్డు శ్రీనివాస్ వాహనాలను తనిఖీ చేస్తున్నాడు. ఆ సమయంలో ఓ కంటైనర్ లారీని ఆపేందుకు శ్రీనివాస్‌ ముందుకెళ్లాడు. అయితే.. ఆ లారీ డ్రైవర్.. బండిని ఆపకుండా అత్యంత వేగంగా వచ్చి శ్రీనివాస్ (35) పైకి పోనిచ్చాడు. దీంతో లారీ చక్రాల కింద పడిన శ్రీనివాస్.. తీవ్ర గాయాలపాలైయ్యాడు. అక్కడికక్కడే మృతి చెందాడు.


సమాచారం అందుకున్న వెంటనే పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, మేడ్చల్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్త గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.


 


Latest News
 

3వ రౌండ్: కామారెడ్డి, కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఆధిక్యం Sun, Dec 03, 2023, 10:24 AM
ములుగులో సీతక్క ముందంజ Sun, Dec 03, 2023, 10:22 AM
తెలంగాణలో మార్పు తథ్యమైంది Sun, Dec 03, 2023, 10:16 AM
ఖమ్మంలో ఓట్ల లెక్కింపు ప్రారంభం Sun, Dec 03, 2023, 10:10 AM
57 స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం Sun, Dec 03, 2023, 10:09 AM