byసూర్య | Wed, Jan 25, 2023, 02:36 PM
కొల్లాపూర్ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం దగ్గర విద్యార్థులు మనోహరంగా నిలిచి బుధవారం మధ్యాహ్నం ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ కేంద్రంలో బుధవారం జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమాన్ని మండల రెవెన్యూ అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులచేత ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఓటరు గా నమోదు చేసుకోవాలని ఓటు హక్కును వినియోగించుకోవాలని తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ గోవిందరెడ్డి వీఆర్వోలు సిబ్బంది ఉపాధ్యాయులు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. ఉపాధ్యాయుడు శ్రీకాంత్ సందేశము చదివి వినిపించారు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు జాతీయ ఓటర్ నమోదు కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తదితరులు పాల్గొన్నారు.