byసూర్య | Wed, Jan 25, 2023, 02:27 PM
ములుగు జిల్లాలో మంగళవారం కంటి వెలుగు శిబిరాల్లో 2, 806 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య తెలిపారు. ఇందులో 1, 257 మందికి రీడింగ్ అద్దాలు అందచేసినట్లు తెలిపారు. 900 మందికి ప్రత్యేక అద్దాలు అవసరమని గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు స్వచ్చందంగా కంటివెలుగు శిబిరాలకు హాజరై కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆయన తెలిపారు.