పరేడ్ గ్రౌండ్స్ లో బిఆర్ఎస్ భారీ సభ
byసూర్య |
Wed, Jan 25, 2023, 01:42 PM
భారత రాష్ట్ర సమితి దేశవ్యాప్త ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఖమ్మంలో టిఆర్ఎస్ సభ విజయవంతం కావడంతో రెండో భారీ బహిరంగ సభ నిర్వహణకు కెసిఆర్ సిద్ధమయ్యారు. ఈసారి వేదికగా హైదరాబాద్ ఎంచుకున్నారు. నూతన సచివాలయం ప్రారంభించే ఫిబ్రవరి 17న పరేడ్ గ్రౌండ్స్ లో టిఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. హైదరాబాదులో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు. దీంతో వ్యూహాత్మకంగా భాగ్యనగరంలో సభ ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ నాయకులూ మంగళవారం తెలిపినారు.
Latest News