జనసేన, టీడీపీ కలిస్తే మా పరిస్థితి ఏమిటీ...తెలంగాణ బీజేపీ నేతల అంతర్మథనం

byసూర్య | Wed, Jan 25, 2023, 01:38 PM

జనసేన, టీడీపీ పార్టీలు కలిస్తే తమ పరిస్థితి ఏమిటీ అన్న ఆందోళన ఏపీ బీజేపీ నేతల్లోనే కాదు తెలంగాణ కమలం నేతల్లోనూ నెలకొంది. ఇందుకు ఎవరి లెక్కలు వారికున్నాయి. ఇదిలావుంటే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. పొత్తులు, రాజీకయ ఎత్తులతో అన్ని పార్టీల నేతలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తమకు కలిసొచ్చే పార్టీతో వెళ్లి అధికారం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. తాజాగా.. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ తెలంగాణ బీజేపీ నేతలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.


జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో తన ఎన్నికల ప్రచారం రథం 'వారాహి'కి మంగళవారం పూజలు నిర్వహించిన అనంతరం.. తెలంగాణలోని కార్యకర్తలను ఉద్దేశించి పవన్ మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీలో కనీసం 10 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉండాలని కోరుటుకుంటున్నట్లు చెప్పారు. పరిస్థితులను బట్టి 7 నుంచి 14 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు.., నేతలు ఎక్కడ పోటీ చేద్దామంటే అక్కడి నుంచే పోటీ చేద్దామని పవన్ అన్నారు. తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మంచి భావజాలం ఉన్న పార్టీతో తాము పొత్తులకు రెడీ అని వ్యాఖ్యనించారు.


ఏపీలో బీజేపీతో ప్రస్తుతం పొత్తులో ఉన్నామని.., తమ పొత్తు ఇంకా కొనసాగుతుందని చెప్పారు. 'బీజేపీతో కలిసే ఉన్నాం.. ఉంటాం.. కాదంటే కొత్త వాళ్లతో పోతాం. పొత్తులపై ఎన్నికలకు వారం రోజుల ముందు క్లారిటీ వస్తుంది. కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా వెళ్తాం. లేకపోతే ఒంటరిగా వెళ్తాం.' అని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ బీజేపీ నేతల్లో టెన్షన్ మెుదలైంది. ఏపీలో పవన్ బీజేపీతో కలిసే ఉన్నా.. గత కొంత కాలంగా ఆ పార్టీతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఏ ప్రభుత్వ వ్యతిరేక కార్యకమమైనా ఒంటిరిగానే నిర్వహిస్తున్నారు. తాము వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమంటూ పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు.


చంద్రబాబుతో భేటీలో రాజకీయ అంశాలు ప్రస్తావించలేదని చెబుతున్నా.. ఎన్నికల నాటికి ఆయన 2014 కాంబినేషన్‌కు వెళ్లే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీని ఓడించాలంటే అన్ని పార్టీలు కలిసి పోటీచేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ టీడీపీతో పొత్తుకు బీజేపీ సుముఖంగా లేనట్లు సమాచారం. దీంతో జనసేనానని బీజేపీకి గుడ్‌బై చెప్పి టీడీపీతో దోస్తీ కట్టే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే తెలంగాణలోనూ జనసేన, టీడీపీలు కలిసే ఎన్నికలకు వెళతాయి.


ఇప్పటికే తెలంగాణలో పూర్వవైభవం కోసం టీడీపీ తహతహలాడుతోంది. ఇటీవల ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన చంద్రబాబు.. తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం నింపారు. చంద్రబాబు డైరక్షన్‌లో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పలువురుని పార్టీలోకి ఆహ్వానిస్తూ.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ- జనసేన కలిసి పోటీ చేస్తే అది బీజేపీకి మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


బీఆర్ఎస్‌కు తామే పత్యామ్నాయమని బీజేపీ చెబుతోంది. సీఎంను గద్దె దించి అధికారంలోకి వస్తామని అంటోంది. ఆ దిశగా బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారు. కాషాయ దళంలో ఉత్సాహం నింపుతూ ఎన్నికలకను సన్నద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన- టీడీపీ కలిసి పోటీ చేస్తే బీజేపీకి షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళితే.. ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి. అలా జరిగితే అంతిమంగా బీఆర్ఎస్‌కు లాభం చేకూరటంతో పాటు బీజేపీ నష్టపోయే ఛాన్స్ ఉంది. దీంతో తెలంగాణ బీజేపీ నేతల్లో టెన్షన్ మెుదలైంది.


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM