byసూర్య | Wed, Jan 25, 2023, 01:27 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని షిర్డీ హిల్స్ బ్లాక్-ఏ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు. సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ కాలనీలో ఎటువంటి సమస్యలన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు మారయ్య, కాలనీ ప్రెసిడెంట్ సీహెచ్ దాసు, జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్, క్యాషియర్ శేషు తదితరులు పాల్గొన్నారు.