తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
byసూర్య |
Wed, Jan 25, 2023, 11:33 AM
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అకౌంటెన్సీ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తూ సీఈఏ పేరుతో మరో గ్రూపును అందుబాటులోకి తీసుకురానుంది. ఈ గ్రూపులో అకౌంటెన్సీతో పాటు కామర్స్, ఆర్థిక శాస్త్రం ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ గ్రూపును ప్రవేశపెట్టనున్నారు. ఇంటర్ స్థాయిలోనే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందేలా ఈ గ్రూపును రూపొందిస్తున్నామని బోర్డు కార్యదర్శి తెలిపారు.
Latest News