![]() |
![]() |
byసూర్య | Tue, Jan 24, 2023, 07:37 PM
బోధన్ మండల పరిషత్ లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో కే. శ్రీనివాస్ ను మంగళవారం పలు గ్రామాల ఎంపీటీసీలు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపిటిసిలు ఎంపీడీవో తో ముచ్చటించారు. గ్రామాల అభివృద్ధి పనితీరుపై చర్చించారు. బోధన్ మండలంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి పనులు సక్రమంగా నిర్వహించడం జరుగుతుందని, తమకు సహకరిస్తూ తమ సహకారం తీసుకొని గ్రామాల అభివృద్ధికి పాటుపడుతామని ఎంపిటిసిలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎరాజ్ పల్లి ఎంపీటీసీ వెంకటేశం గుప్తా, పలు గ్రామాల పెద్దలు గంగాధర్, భూమారెడ్డి తదితరులు ఉన్నారు.