గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

byసూర్య | Tue, Jan 24, 2023, 07:36 PM

కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో గ్రూప్ 3, 4 నాలుగు పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా అదనపు కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, రాజేశం లు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా రూపొందించిన స్టడీ మెటీరియల్ ను జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న 99 మంది అభ్యర్థులకు 90 రోజుల శిక్షణ అనంతరం ఈ మెటీరియల్ ను పంపిణీ చేయడం జరిగిందని, అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ వట్టి పోతున్న తాగునీరు Sat, Apr 20, 2024, 01:28 PM
నేడు బీబీపేటకు షబ్బీర్ అలీ రాక Sat, Apr 20, 2024, 01:06 PM
ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి Sat, Apr 20, 2024, 01:04 PM