అట్టహాసంగా తెలంగాణ సచివాలయం ప్రారంభ వేడుక....జాతీయ నేతల రాక

byసూర్య | Tue, Jan 24, 2023, 05:23 PM

బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కేసీఆర్ తన ప్రభుత్వ వేడుకలను కూడా ఆయన జాతీయ కోణంలోనే చేపడుతున్నారు. ఇదిలావుంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు వచ్చే నెల (ఫిబ్రవరి) 17న ఉదయం 11.30 గటంలకు కొత్త సచివాలయం ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవానికి పలువురు జాతీయ నేతలతో పాటు ప్రముఖులు హాజరు కానున్నారు. ఆ రోజు ఉదయం వాస్తుపూజ, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చండీయాగం, సుదర్శనయాగం ఉంటుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.


కాగా.. సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వినీ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డా. బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ స్పెషల్ గెస్ట్‌గా హాజరు కానున్నారు. సచివాలయం భవనం ప్రారంభం అనంతరం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో సచివాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్య అతిథులందరూ పాల్గొంటారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.


తెలంగాణ కీర్తిప్రతిష్టలు ప్రతిబింబించేలా ఐకానిక్ బిల్డింగ్‌గా కొత్త సెక్రటేరియట్‌ను నిర్మించారు. 265 అడుగుల ఎత్తుతో 28 ఎకరాల్లో నూతన సచివాలయాన్ని నిర్మించారు. మొత్తం 10,51,676 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం ఉంది. మొత్తం ఏడు అంతస్తులు నిర్మించగా.. ఒక్కో అంతస్తు 14 అడుగుల ఎత్తు ఉంటుంది. 6వ అంతస్తులో ముఖ్యమంత్రి ఛాంబర్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో స్టోర్ రూమ్, సిబ్బంది రూమ్స్ లాంటివి ఉంటాయి.


బిల్డింగ్‌పైన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తు గల జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేశారు. వీటిని ఢిల్లీలో తయారుచేయించి హైదరాబాద్‌కు తరలించారు. భారీ క్రేన్ల సహాయంతో వీటిని బిల్డింగ్ పైభాగంలో ఏర్పాటు చేశారు. బిల్డింగ్ నలువైపులా మొత్తం 2 ప్రధాన గుమ్మటాలు. 34 చిన్న గుమ్మటాలు ఏర్పాటు చేశారు. సచివాలయానికి మొత్తం నాలుగు గేట్లు ఏర్పాటు చేశారు.


లుంబినీ పార్క్ ఎదురుగా ప్రధాన ద్వారం ఉండనుండగా.. సీఎం కాన్వాయ్ ఈ ద్వారం గుండా లోపలికి వస్తుంది. ఇక ఎన్టీఆర్ గార్డెన్‌కు ఎదురుగా మరో గేటు ఏర్పాటు చేయగా.. ఉద్యోగులు ఈ గేటు గుండా ఆఫీసులకు చేరుకుంటారు. ఇక బిర్లామందిర్ వైపు మరో గేటు ఉండగా.. సామాన్యులకు ఈ ద్వారం కూడా ప్రవేశం ఉంటుంది. ఇక సచివాలయం వెనుక భాగంలో నాలుగు గేటు ఉంటుంది.


300 కార్లు. 600 ద్విచక్ర వాహనాలు ఒకేసారి పార్క్ చేసుకునేలా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. సీఎంవో ఛాంబర్‌లో 30 కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. సీఎం, మంత్రులు, ఉద్యోగులు, సామాన్యులకు వేర్వురుగా పార్కింగ్ సదుపాయం కల్పిస్తారు. 100 ఏళ్ల పాటు ఉండేలా తెలంగాణ కొత్త సచివాలయం నిర్మించినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. నూతనంగా నిర్మించిన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM