byసూర్య | Tue, Jan 24, 2023, 03:55 PM
కురుమూర్తి దేవస్థానం హుండీలోని కానుకలు మంగళవారం లెక్కించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం కురుమూర్తి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కింపు చేశారు. భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకలు లెక్కింపు చేయగా రూ. 3, 96, 567 గా వచ్చినట్టు కార్య నిర్వహణ అధికారి మాధనేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ ఉండి లెక్కింపు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రతాపరెడ్డి, కమిటీ సభ్యులు నూకల శంకర్, వేంకటేశ్వర రెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.