byసూర్య | Tue, Jan 24, 2023, 03:48 PM
నిజామాబాద్ నగరంలో ని పలు ఆలయాల్లో పూజలు ఎమ్మెల్యే గణేష్ బిగాల నిర్వహించారు.శ్రీ నీల కంఠేశ్వర్ స్వామి వారి ఆలయం లో పూజలు నిర్వహించి నూతన రథాన్ని పరిశీలించారు. రథ సప్తమి సందర్భంగా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లూ చేయాలని దేవాదాయ అధికారులని ఆదేశించారు.నాందేవ్ వాడ లోని శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.
కిషన్ గంజ్ లోని శ్రీ కన్యక పరమేశ్వరి మాత ఆలయం లో పూజలు నిర్వహించారు.గంగా స్థాన్ లోని ఉత్తర తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ దండు నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, సిర్ప రాజు, బిళ్ళ మహేష్ , బీఆర్ఎస్ కార్పొరేటర్ లు, నాయకులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.