26న బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరుగు పందెం పోటీలు

byసూర్య | Tue, Jan 24, 2023, 03:20 PM

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరుగు పందెం పోటీలు నిర్వహిస్తున్నట్లు మందమర్రి మండల రైతుబంధు కోఆర్డినేటర్ బలికొండ కిషన్ తెలిపారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే పరుగు పందెం బొక్కలగుట్ట ఋష్యముఖ పర్వతం చుట్టూ ఒకటిన్నర కిలోమీటర్ జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోంటోతో పాటు రూ. 5 వేలు నగదు, రెండవ బహుమతిగా రూ. 2, 016 నగదు, శాలువా, మూడవ బహుమతి రూ. 1, 016 శాలువా అందించనున్నట్లు తెలిపారు. పరుగు పందెంలో పాల్గొనేవారు 9666980116 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM