26న బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరుగు పందెం పోటీలు
byసూర్య |
Tue, Jan 24, 2023, 03:20 PM
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరుగు పందెం పోటీలు నిర్వహిస్తున్నట్లు మందమర్రి మండల రైతుబంధు కోఆర్డినేటర్ బలికొండ కిషన్ తెలిపారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే పరుగు పందెం బొక్కలగుట్ట ఋష్యముఖ పర్వతం చుట్టూ ఒకటిన్నర కిలోమీటర్ జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోంటోతో పాటు రూ. 5 వేలు నగదు, రెండవ బహుమతిగా రూ. 2, 016 నగదు, శాలువా, మూడవ బహుమతి రూ. 1, 016 శాలువా అందించనున్నట్లు తెలిపారు. పరుగు పందెంలో పాల్గొనేవారు 9666980116 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.
Latest News