26న బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరుగు పందెం పోటీలు

byసూర్య | Tue, Jan 24, 2023, 03:20 PM

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరుగు పందెం పోటీలు నిర్వహిస్తున్నట్లు మందమర్రి మండల రైతుబంధు కోఆర్డినేటర్ బలికొండ కిషన్ తెలిపారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే పరుగు పందెం బొక్కలగుట్ట ఋష్యముఖ పర్వతం చుట్టూ ఒకటిన్నర కిలోమీటర్ జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోంటోతో పాటు రూ. 5 వేలు నగదు, రెండవ బహుమతిగా రూ. 2, 016 నగదు, శాలువా, మూడవ బహుమతి రూ. 1, 016 శాలువా అందించనున్నట్లు తెలిపారు. పరుగు పందెంలో పాల్గొనేవారు 9666980116 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM