byసూర్య | Tue, Jan 24, 2023, 02:56 PM
వీర్నపల్లి మండలం అంబేడ్కర్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మండలంలోని అన్ని పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా ఆటల్లో పాల్గొని సత్తా చాటుతు ఆటలో గెలుపొందారు. గెలుపొందిన విద్యార్థులకు ఈ నెల 26 గణతంత్ర దినోత్సవం రోజున ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేస్తామని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎం సి చైర్మన్ జోసెఫ్, ఉపాద్యాయులు రఘుపతి, అంగన్ వాడి టీచర్ వినయ కుమారి ఉన్నారు.