byసూర్య | Tue, Jan 24, 2023, 02:49 PM
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ మార్కండేయ జయంతి సంధర్బంగా మంగళవారం బాన్సువాడ పట్టణంలోని మార్కండేయ మందిరంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పద్మశాలి సంఘం అధ్వర్యంలో నిర్వహించిన కలుశాల ఊరేగింపును జెండా ఉపి ప్రారంభించి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు, మహిళలు , బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.