byసూర్య | Tue, Jan 24, 2023, 02:46 PM
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గట్టు మండలం ఆలూర్ గ్రామంలోని లబ్దిదారులు మాణిక్యమ్మ సవరప్ప చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే శ్రీ బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి మంగళవారం సీఎం సహాయనిధి 60, 000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పిఎసిఎస్ డైరెక్టర్ సుభాన్, ఆలూర్ ఎంపీటీసీ ఆనంద్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలూరు రాముశెట్టి, తిమ్మప్ప, మహేష్, ఈరన్న ఆలూర్ గ్రామస్తులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.