byసూర్య | Thu, Dec 08, 2022, 11:37 AM
ఎన్నికలు, రాజకీయాల కోసం ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ పై ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య జోస్యం చెప్పారు. ఎన్నికల సమయంలోనే సీఎంకు పావరం ట్లు, మెట్రో రైలు గుర్తుకు వస్తాయని అన్నారు. తాను అధికారంలోకి వచ్చాక ఎలాంటి కారణం లేకపోయినా మూడేళ్ల పాటు మెట్రో పనులను ఆపేసిన కేసీఆర్ ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో తరుణంలో మళ్లీ ఎయిర్ పోర్టు, హయత్ నగర్ వరకు మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు తీసుకొచ్చారని పొన్నాల ఆరోపించారు. సింగరేణిలో కొత్త విద్యుత్ ఏర్పాటు ప్రతిపాదన కూడా ఎన్నికల కోసమేనన్నారు.