byసూర్య | Thu, Dec 08, 2022, 11:33 AM
నిరు పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్ వరంగా మారిందని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామానికి చెందిన దేశాల లక్ష్మయ్య కు సీఎం సహా నిధి నుంచి మంజూరైన 60, 000/- వేల రూపాయల విలువ గల చెక్కును ఎమ్మెల్యే అంజయ్య యాదవ్గురువారం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరికంలో ఉండి, అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయుక్తంగా మారింది అన్నారు.