ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య

byసూర్య | Thu, Dec 08, 2022, 11:27 AM

ఆర్థిక కారణాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం సంగెం గ్రామానికి చెందిన పూస్కూరి యాదయ్య -కలమ్మ దంపతుల చిన్న కుమార్తె ప్రశాంతి ని పొద్దుటూరు గ్రామానికి చెందిన కుమార్ కు 7 ఏండ్లు కిందట వివాహం జరిగింది. కొంతకాలం నుండి ఆర్థిక సమస్యలతో ప్రశాంతి మనస్థాపం చెందగా, ఇటీవల సోదరుడు పుట్టింటికి తీసుకొచ్చాడు. ప్రశాంతి బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.


Latest News
 

చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM
చిలుకూరు గరుడ ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ Fri, Apr 19, 2024, 07:46 PM
తెలంగాణలో సమ్మర్ హీట్.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Fri, Apr 19, 2024, 07:42 PM
తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ అవకాశం కూడా కల్పించిన ఈసీ Fri, Apr 19, 2024, 07:37 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. ఈసారి పోలీసులే Fri, Apr 19, 2024, 07:32 PM