byసూర్య | Thu, Dec 08, 2022, 11:15 AM
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి మరింత బలపడినట్టు ఐఎండీ తెలిపింది. వాయువ్య దిశగా కదులుతూ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు తీరానికి దగ్గరగా వస్తూ మరింత బలపడి గురువారం ఉదయానికి తుఫానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. అనంతరం తుఫాను తీవ్ర ప్రభావం చూపవచ్చని తెలిపింది. రాష్ట్రంలో నేడు, రేపు పొడివాతావరణం ఉంటుందని, ఆగ్నేయ, తూర్పు ప్రాంతాల నుంచి వీచే గాలులతో చలి తీవ్రత పెరుగుతుందని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు చిరుజల్లులు కురువొచ్చని పేర్కొంది.