byసూర్య | Thu, Dec 08, 2022, 10:53 AM
రాబోయే 10 రోజుల్లో రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు జమ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. జగిత్యాల జిల్లాలో బుధవారం జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఎల్లుండి కేబినెట్ మీటింగ్ ఉంది. కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకొని రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం జమ చేస్తాం. ప్రపంచంలో రైతుబంధు ఇచ్చే రాష్ట్రం ఎక్కడా లేదు. రైతుబంధు, రైతు బీమా ఇచ్చేది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. కేసీఆర్ బ్రతికున్న వరకు రైతుబంధు ఆగదు' అని అన్నారు.