byసూర్య | Tue, Dec 06, 2022, 05:00 PM
జడ్చర్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి పులమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ బుక్క వెంకటేష్, జడ్చర్ల దళిత అధ్యక్షులు మల్లికార్జున్, టౌన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శాగంటి రఘు, యూత్ కాంగ్రెస్ నాయకుడు వంశీ చారి, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పెద్దపల్లి శీను, NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి పహద్, జావేద్ , నక్క రాఘవేందర్, రాజీవ్ గాంధీ , ఇంతియాజ్, శివ, రాఘవేంద్ర, రమేష్, తదితరులు పాల్గొన్నారు.