byసూర్య | Tue, Dec 06, 2022, 04:54 PM
నారాయణఖేడ్ పట్టణంలోని వాహనదారులు సరైన పత్రాలు లేకుండా వాహనాలను నడుపుతే జరిమానా విధించడంతో పాటు ఆయా వాహనాలను సీజ్ చేస్తామని నారాయణఖేడ్ ఎస్సై వెంకట్ రెడ్డి హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ ఆహనాలకు ఆర్సి డ్రైవింగ్ లైసెన్స్, బీమా పత్రాలు, రవాణా ఆహ్వానాలకు వీటితోపాటు టాక్స్, ఫార్మేట్, ఫిట్నెస్ ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు. ఎవరైనా స్కాప్ వాహనాలు నడిపితే వాటిని ఆర్డిఓకు పంపుతామని అన్నారు. నారాయణఖేడ్ పట్టణంలో రోడ్ల పక్కన పార్కింగ్ చేస్తే ఫోటోలో తీసి జరిమానా విధిస్తామన్నారు. సీసీ కెమెరాల సహాయం తో ఇప్పటి వరకు 300 వాహనాలకు జరిమానా విధించినట్లు వివరించారు.