byసూర్య | Tue, Dec 06, 2022, 04:51 PM
నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయబడిన నిజాంపేట్ మండల కేంద్రం ప్రారంభమైన సందర్భంగా నూతన (MRO) తహశీల్దార్ జాయింట్ సబ్ రిజిస్టర్ గా వచ్చిన మదన్ ని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే , బిజెపి నాయకులు ఎం. విజయ్ పాల్ రెడ్డి. మండల కేంద్ర ఏర్పాటు కోసం పోరాడిన నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ మండల కేంద్రం ఏర్పాటైన సందర్భంగా సేవలను వినియోగించుకోవాలని అధికారులను గౌరవించి పనులు చేసుకోవాలని, అధికారులకు ఇబ్బంది కలిగించకుండా స్వేచ్ఛగా అధికారులు పనిచేసే విధంగా సహకరించాలన్నారు. అధికారులు ప్రజా సమస్యలను త్వరగా పరిష్కారం అయ్యే విధంగా పనిచేయాలని కోరారు. ఆయన వెంట నాయకులు బాబ్య నాయక్, భూమేష్, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, బిజెపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.