byసూర్య | Tue, Dec 06, 2022, 04:50 PM
జిఓ 317 విడుదలై నేటికీ సంవత్సరం అయిన సందర్భంగా జీ ఓ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో భోజన విరామ సమయంలో జీవో 317 వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ జిఓ వలన అనేక మంది ఉపధ్యాయులు తమ స్థానికతను కోల్పోయారని, అనేకమంది భార్య భర్తలు వేర్వేరు జిల్లాల్లో ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితి వచ్చిందని, వెంటనే ప్రభుత్వం ఈ జీవో వలన నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, లేని పక్షం లో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమం లో తపస్ చేగుంట మండల అధ్యక్షులు రావుల వెంకటేష్, ప్రధాన ఉపాధ్యాయులు రమేశ్, రాధ, సుధాకర్ రెడ్డి, రాథోడ్, చక్రధర్ శర్మ, ఈశ్వరయ్య, రాజేశ్వర్ రావు, భవాని, శారదా, మాదవి, సునంద, పద్మజ తదితరులు పాల్గొన్నారు.