byసూర్య | Tue, Dec 06, 2022, 04:48 PM
నిజాంపేట మండల కేంద్రంలోనిజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా డిఇఓ రమేష్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరి మనబడి ఎన్ఆర్ జె ఎస్ పనులు స్కూళ్లలో ఏ విధంగా జరుగుతున్నాయో దానిపై ఆరా తీశారు. అదేవిధంగాస్కూళ్లలో పెండింగ్లో ఉన్న పనులను త్వరతగతిన పూర్తిచేయాలని ఇది ఒక మంచి అవకాశం పాఠశాల బలోపేతానికి ప్రజా ప్రతినిధులు ఏఎంసీ చైర్మన్లకు ప్రధానోపాధ్యాయులకు ఇది ఒక మంచి అవకాశం అని దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలజెడ్పిటిసి పంజా విజయ్ కుమార్, ఎంపిపి సిద్దరాములు, ఎంపీడీవో వెంకటలక్ష్మి, ఎంఈఓ నీలకంఠ, డిఇ నాగభూషణం, ఏఈ తిరుమలేష్ గౌడ్, వీఆర్ఏఈ విజయకుమార్, సీఎంఓ డాక్టర్ సూర్య ప్రకాష్, ఆయా గ్రామాల సర్పంచులు అనూష, నరసింహారెడ్డి, అనిల్ కుమార్, ఆయా గ్రామాల ప్రధానోపాధ్యాయులు ఏఎంసీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.